BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies Notification Released Now... Apply Soon                                 

Friday, 15 May 2026

ట్రిపుల్ ఐటీకి 29,011 దరఖాస్తులు

 ట్రిపుల్ ఐటీకి 29,011 దరఖాస్తులు


 ట్రిపుల్ ఐటీలో సీట్లు దక్కించుకునేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్సుకత చూపిస్తు న్నారు. ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. గురువారం నాటికి 29,011 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్టీయూకేటీ రిజి స్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన విద్యా ర్థుల జాబితాను జూన్ 12న ప్రకటిస్తామని తెలిపారు. తరగతులు జులై నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు


ఆహ్వానిస్తున్నాయ్.. ట్రిపుల్ ఐటీలు! మే 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం

ఎక్కడెక్కడంటే... 
రాజీవాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయం (ఆర్టీయూకేటీ) పరిధిలో నూజివీడు, ఇడు పులపాయ (ఆర్. కె. వ్యాలీ), శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వాటిలో ప్రతి విద్యా సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున నాలుగు వేల మందికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈబీసీ కోటా కింద మరో 400 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనం తరం నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభమవుతుంది.

 బ్రాంచులు ఇవీ.. : ఈ కళాశా 3 ధ్రువపత్రాల పరిశీలన లల్లో సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానిక్ కోర్సులు ఉన్నాయి. నూజివీడు, ఆర్. కె వ్యాలీ క్యాంపస్ కెమికల్ ఇంజినీ రింగ్, మెటలర్జికల్, మెటీరియల్ కోర్సులు కూడా అదనంగా అందుబా టులో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థు లకు ఉచిత వసతి, భోజన సదు పాయం కల్పిస్తున్నారు.

 ధ్రువపత్రాల పరిశీలన: నూజివీడు, ఆర్. కె. వ్యాలీ క్యాంపస్ కు ఎంపికైన వారికి జూన్ 19, 20 తేదీల్లో, శ్రీకా కుళం, ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి 22, 23 తేదీల్లో ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. సీట్లు పొందిన వారు ఆయా క్యాంపస్ జులై 1న చేరాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఇలా... అర్హులైన వారు www.rgukt.in వెబ్ సైట్ ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి ఆధార్, ఫోన్ నంబరు, పదోతర గతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేకంగా డిప్రైవేషన్ స్కోర్ 4 శాతం మార్కులు కలిపి అర్హుల జాబితా వెల్లడిస్తారు. • ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. వచ్చే నెల 12న నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక జాబితా విడుదల చేస్తారు.


RGUKT IIIT ADMISSIONS NOTIFICATION RELEASED| HOW TO APPLY FOR IIIT?| ELIGIBILITY| CUT OFF FOR IIIT

Apply here

https://admissions.rgukt.in/ RGUKT-ANDHRA PRADESH ADMISSIONS FOR THE A.Y: 2026-27 PROSPECTUS and Detailed Notification
https://admissions.rgukt.in/storage/RGUKT%20Admissions-2026%2027-Prospectus.pdf


for more details watch below video










No comments:

Post a Comment