BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Friday 5 May 2023

AP Tenth Results 2023: Flash..Flash..ఏపీ టెన్త్ రిజల్ట్స్... |రేపు పదవ త...


AP Tenth Results 2023: Flash..Flash..     ఏపీ టెన్త్ రిజల్ట్స్... అధికారుల కీలక ప్రకటన,  
రేపు SSC ఫలితాలు విడుదల. విద్యాశాఖ మంత్రి ప్రకటన

ఏపీ టెన్త్ ఫలితాల విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై ఎస్ఎస్సీ బోర్డు స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది.

రేపు ఉదయం 11.00 లకి పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి - మంత్రి వర్యులు బొత్సా గారు.
ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయన్న అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఈ రోజు, రేపు అంటూ జోరుగా సాగుతోంది.
మే 5, 7వ తేదీల్లో ఫలితాలు విడుదల అవుతాయంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో SSC బోర్డు ఫలితాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు SSC ఫలితాలు విడుదల. విద్యాశాఖ మంత్రి ప్రకటన

 ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18వ తేదీన టెన్త్ ఎగ్జామ్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ ఎప్పుడు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను మే6 విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించారు. ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ సైతం నిర్వహించారు.  30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మార్కుల టేబులేషన్ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమతితో May 6 ఫలితాలను విడుదల చేయాలన్నది విద్యాశాఖ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే..   ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే.. మొత్తం 6,09,070 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు గాను.. 6,03,700 మంది పరీక్షలకు హాజరయ్యారు. 





Chapathi Pizza..... #shorts

Tuesday 2 May 2023

RBI Grade B Officer Recruitment 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 291 పోస్టులు...

RBI Recruitment: నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే..


నిరుద్యోగులు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఒక గుడ్‌న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు తెలుసుకుందాం.

ఆర్బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ(DR)-జనరల్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ B (DR)- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ (DR)- స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మే 9 నుంచి అధికారిక పోర్టల్ opportunities.rbi.org.in లో అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ జూన్ 9తో ముగియనుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ(DR)-జనరల్ నుంచి 222 పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ B (DR) డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ నుంచి 38 పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ (DR)- స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ నుంచి 31 పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు.

జీతం ఎంత?
గ్రేడ్ B ఆఫీసర్ విభాగంలోని ఉద్యోగాలకు నెలకు రూ.55,200 జీతం ఉంటుంది. ఆఫీసర్స్ గ్రేడ్ ‘B’(DR)- DEPR ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి జీతం నెలకు రూ. 44500 నుంచి జీతం ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్స్, బెనిఫిట్స్ వర్తిస్తాయి.

అర్హత ప్రమాణాలు
గ్రేడ్ B ఆఫీసర్(DR) - (జనరల్)
ఈ పోస్ట్‌కు అప్లై చేసుకోవాలనుకునే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం స్కోర్ చేసి ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసిన జనరల్, ఓబీసీ అభ్యర్థులైతే ఓవరాల్‌గా 55 శాతం స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ మార్కులు సాధిస్తే సరిపోతుంది.

గ్రేడ్ B ఆఫీసర్ (DR) - DEPR
ఈ ఉద్యోగానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్, ఫైనాన్స్‌లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా కనీసం 55% మార్కులతో PGDM/ MBA ఫైనాన్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎకనామిక్స్ సబ్ కేటగిరీలో అగ్రికల్చరల్, బిజినెస్, డెవలప్‌మెంట్, అప్లైడ్‌ వంటి వాటిపై కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలి.

గ్రేడ్ బీ ఆఫీసర్ (DR)-DSIM
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్‌ లేదా ఐఐటీ- బాంబే నుంచి అప్లైడ్ స్టాటిస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కనీసం 55% మార్కులతో పాసై ఉండాలి. లేదా కనీసం 55% మార్కులతో మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్, సంబంధిత సబ్జెక్టుల్లో ఒక సంవత్సరం పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55% మార్కులతో M స్టాట్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా ఐఎస్‌ఐ కోల్‌కతా, IIT ఖరగ్‌పూర్, IIM కలకత్తా సంయుక్తంగా అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (PGDBA) కోర్సులో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
ఆర్బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ల పోస్ట్‌ల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్, చివరగా ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఈ పరీక్షలు జులై 9 నుంచి ఆగస్టు 8 మధ్య జరుగుతాయి. ఈ మూడు పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ opportunities.rbi.org.in విజిట్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ‘గ్రేడ్ బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్-2023‌’పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

- అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ముంబైకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను జనరేట్ చేస్తుంది.

- తర్వాత లాగిన్ అయి అడ్వర్టైజ్‌మెంట్ పేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేయాలి.

- అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రివ్యూ చూసుకున్న తరువాత సబ్‌మిట్ చేయండి.


Watch Video for more details.....

AP TET, TS TETలో అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్| CTET నోటిఫికేషన్ విడ...